అనంతపురంలోని సూర్య నగర్ లో బీజేపీ సన్నాహక సమావేశం గురువారం మండల అధ్యక్షుడు బోయ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమానికి సన్నాహకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.