డిఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు రెండు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించడంలో విద్యాశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. అక్టోబర్ 3న విధుల్లో చేరిన ఉపాధ్యాయులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ ఆలస్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.