రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని జిల్లా
వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో
వైసీపీ శ్రేణులతో కలిసి టవర్ క్లాక్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వ దిష్టిబొమ్మతో అంతిమయాత్ర నిర్వహించారు. రెండేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రంగా మోసం చేశారని వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.