అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ హమీద్ ఖాన్ మాట్లాడుతూ, లంచం అడగాలంటే అధికారుల గుండెల్లో వణుకు పుట్టాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇస్తేనే పనులు జరుగుతాయనే పరిస్థితి నుండి ప్రజలు బయటపడి ఫిర్యాదు చేయడం అభినందనీయమని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లా ప్రజలు అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.