అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 మందికి 13,621 మంది హాజరు కాగా, 269 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 మందికి 2,119 మంది హాజరు కాగా, 139 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించబడ్డాయి.