ఆదివారం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఆమె కొన్ని రోజులుగా ఆసుపత్రిలోని సందర్శన శాలలో ఉంటూ చికిత్స తీసుకునేవారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. వృద్ధురాలి వివరాలు తెలియాల్సి ఉంది.