అనంతపురం రూరల్ మండలంలోని సిండికేట్ నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా మోడల్ పేపర్స్ ను మాజీ కోశాధికారి రామకృష్ణ విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా యూటీఎఫ్ తయారుచేసిన పుస్తకాలు ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడ్డాయని నాయకులు గోవిందరాజులు, లింగమయ్య, సుబ్బరాయుడు, నాగేంద్ర తెలిపారు.