ధర్మవరం మండలం మోటుమర్ల వంకలో సోమవారం ఉదయం భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవాహం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వంక ప్రధాన రహదారిపైకి చేరడంతో పుట్టపర్తి, ధర్మవరం మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిపై మోటుమర్ల గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.