హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్, ఆర్ అండ్ బి శాఖ బీసీ జనార్థన్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో రహదారి, వంతెన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ధర్మవరం – NH-42 రహదారిపై గుట్టకిందపల్లి, గూడ్స్షెడ్ కొట్టాలు గొట్లూరు, సుబ్బారావుపేట, సంగమేశ్వరం గ్రామాల మీదుగా వెళ్లే రహదారిలో కిమీ 5/2-6 వద్ద ఉన్న దెబ్బతిన్న కాజ్వేను బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.