ధర్మవరం పట్టణంలో ఆదివారం వన్ టౌన్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ రెడ్డప్ప కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు వీరిని స్టేషన్కు పిలిపించి, సమాజానికి ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా జీవించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.