సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో కొంకా చంద్రకళ అనే రైతుకు చెందిన 59 చీని చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. ఉదయం తోటకు వెళ్లిన రైతు నరికివేసిన చెట్లను చూసి కన్నీటి పర్యంతమైంది. రెండున్నర ఎకరాల్లో 300 చీనీ చెట్లు సాగు చేశామని, పంట చేతికి వస్తున్న దశలో చెట్లను నరికి వేశారని రైతు ఆవేదన వ్యక్తం చేసింది.