ధర్మవరం రూరల్ ఎస్సై రాజశేఖర్ న్యూ ఇయర్ వేడుకలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.