ధర్మవరం పట్టణంలోని చెరువు ఒకటో మరవ వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది బుధవారం తొలగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వదలడానికి చెరువు వద్దకు వస్తారని, అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు జింకా చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓం ప్రకాష్ గౌడ్, భూషణ పాల్గొన్నారు.