ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో కార్డెన్ సర్చ్ జరిగింది. అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి, వాహనాల రికార్డులను పరిశీలించారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి, గ్రామంలో ప్రశాంతత పాటించాలని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిఎస్పీ హేమంత్ కుమార్, సీఐలు, పోలీసులు పాల్గొన్నారు.