ధర్మవరం మండలం పోతుకుంటలో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు రామాలయం నుండి మసీదు వరకు రోడ్లు, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏ. నాగవేణి, బీజేపీ నాయకుడు అంగజాల రాజు, పంచాయితీ కార్యదర్శి మురళి గౌడ్ పాల్గొన్నారు.