గుత్తి మండలం ఊబిచెర్ల సమీపంలో శనివారం ఇద్దరు దుండగులు రామాంజనేయులు అనే వ్యక్తిని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ. 5,500 నగదును అపహరించారు. పోతుదొడ్డికి చెందిన రైతు రామాంజనేయులు బైకుపై మార్నేపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనను బెదిరించి నగదును అపహరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.