గుంతకల్లు పట్టణ శివారులోని హనుమాన్ జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం బాలచంద్ర అనే యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.