Feb 14, 2026, 01:02 IST/
నాలుగు కార్లలో బాలికపై సామూహిక అత్యాచారం
Feb 14, 2026, 01:02 IST
మధ్యప్రదేశ్లో రాజధాని భోపాల్లో దారుణం చోటు చేసుకుంది. 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగికదాడి చేశారు. ఆ దృశ్యాలను వీడియో తీసి, దానిని వైరల్ చేస్తామంటూ బెదిరించి ఆమె నుంచి రూ. 40 వేలు వసూలు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఔసఫ్ అలీ ఖాన్, జిమ్ నిర్వాహకుడు మాజ్ ఖాన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.