జనవరి 29న ఓడి చెరువు మండలంలోని తంగేడుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు దాత లక్ష్మీనారాయణ సహకారంతో పుస్తకాలు, పెన్నులు ఓడి చెరువు ఎస్ఐ బి. మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రాజేష్, తిరుపాలు పాల్గొన్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గౌనీపల్లి యువసేన మల్లెల రమేష్ను ఎస్సై అభినందించారు.