హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శుక్రవారం పెనుకొండ మండలం వెంకటగిరి పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో జరిగిన ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ ఆలయంలో పూజలు నిర్వహించారు.