చిలమత్తూరు ఎస్సీ కాలనీలోని టవర్ సమీపంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 10,250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.