కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం అమలుకాకపోవడంతో వీధులు, డ్రైనేజీ కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. దీనివల్ల మురుగునీరు నిలిచి దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పట్టణ ప్రజలు గురువారం తెలిపారు. అధికారులు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని వారు కోరుతున్నారు.