కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) మోడల్ పరీక్ష నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం శ్రీనివాసులు, సంఘం నాయకులు పరీక్ష పత్రాలను ఆవిష్కరించారు. ఈ మోడల్ పరీక్ష విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు.