కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేపట్టిన అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులకు మతిభ్రమించిపోయిందని వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వైపీ రమేష్ విమర్శించారు. బుధవారం కళ్యాణదుర్గం స్థానిక ప్రజావేదిక వద్ద టీడీపీ నాయకులు మాట్లాడుతూ, కళ్యాణదుర్గంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు బజారున పడ్డాయని ఆరోపించారు.