రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన చోళ రాజుల నిర్మించిన కంబదూరు శివాలయంలో తెల్లవారుజామున నుండి శివుడికి అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజతో అలంకరణ నిర్వహించారు. అనంతరం మల్లికార్జునస్వామి భస్మ లేపనం, ఆకుల పూజ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పూజలు చేసి ప్రమిదలలో కార్తీకదీపములు వెలిగించారు. ఆదివారం పూజా కార్యక్రమలు నిర్వహించిన మాచిపల్లి జగదీష్, జ్యోతి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ వారు పూలహారలు, శాలువాలతో సత్కరించారు.