కంబదూరులో మంగళవారం విద్యార్థులు, గ్రామపెద్దలు కలిసి హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల నుంచి అక్కమాంబ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఆలయాన్ని శుభ్రం చేశారు. పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు ఏడీ స్వామి నాయక్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాల ఆవశ్యకతను, భావితరాలకు వాటిని అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషన్, ఎంపీడీవో సూర్య నారాయణ పాల్గొన్నారు.