కంబదూరులో ఆదివారం స్నేహితులతో స్విమ్మింగ్ పూల్కు వెళ్లిన అజయ్ ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మరణంతో మనస్తాపానికి గురైన తల్లి అనిత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే రోజు తల్లీకొడుకు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.