విజయవాడలో నిర్వహించే మాదిగల విజయోత్సవ సభను విజయవంతం చేయాలని డి హెచ్ పి ఎస్ అధ్యక్షుడు ఎం. ఆర్ హనుమంతు అన్నారు. మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్లో సోమవారం జూలై 17న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం ప్రాణాలు వదిలిన అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని విజయవాడ సభలో నాయకుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.