మడకశిర ప్రజల చిరకాల వాంఛ తీరిందని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, డిప్యూటీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డిఓ ఆనంద్ కుమార్ తో కలిసి మడకశిరలో ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మడకశిర ప్రజల చిరకాల వాంఛ తీరినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.