మడకశిరలో వైయస్సార్సీపి నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను దహనం చేశారు. వైకాపా నియోజకవర్గ ఇన్చార్జ్ ఈర లక్కప్ప మాట్లాడుతూ, కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా
విద్యార్థులు, మహిళలు కూటమి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.