మడకశిర టీడీపీ కార్యాలయంలో మంగళవారం, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తాగునీటి వాటర్ ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని, నీటి ట్యాంకుల మోటార్ల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి కూడా పాల్గొన్నారు.