మడకశిర మండలం గౌడన్నహళ్లి పంచాయతీలో బుధవారం జనగణన నిర్వహించారు. క్లస్టర్ సూపర్వైజర్ తిమ్మప్ప ఆధ్వర్యంలో జమ్మానపల్లి గ్రామ సచివాలయ ఎన్యూమరేటర్లు వెంకటేష్, నూరియా బాను ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కచ్చితత్వంతో జనగణన జరుగుతోందని తిమ్మప్ప తెలిపారు.