రొద్దం మండలం కోగిర గ్రామంలో ఆదివారం గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సత్యసాయి జిల్లా వైకాపా అధ్యక్షురాలు, మాజీ మంత్రి కే. వి. ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మను ప్రార్థించినట్లు మాజీ మంత్రి తెలిపారు. ఈ జాతర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.