రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, అంబటి రాంబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. శనివారం పెనుకొండ పట్టణంలో తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవిత మాట్లాడుతూ, అంబటి రాంబాబు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే, తమను రెచ్చగొడితే గుమ్మం దాటి బయటకు రాలేరని హెచ్చరించారు.