అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఆప్కో షోరూమ్లలో అమ్మకాలు, చేనేతలకు ఉచిత విద్యుత్, చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందజేయాలని, ఆప్కో షోరూమ్లలో అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.