ధర్మవరం రూరల్ మండలంలోని రేగాటిపల్లి, దర్శనమల, మల్లేనిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు, దాతలు, రాజకీయ నాయకుల సహకారంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.