కొత్తచెరువు మండల కేంద్రంలో శనివారం పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి నాగరాజు పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె చందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు చేసిన సేవలను కొనియాడుతూ ఆయనను సన్మానించారు. ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీ విరమణ అనేది సర్వసాధారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.