ఓబుల్ దేవర చెరువులో ప్రభుత్వ ఉద్యోగి రామ్మోహన్ ఆదివారం తన పదవీ విరమణ సందర్భంగా సన్మానించబడ్డారు. ప్రాథమిక సహకార సంఘం సీఈఓ గా పనిచేసిన ఆయన సేవలను గుర్తించి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ ఒక విశిష్టమైన ఘట్టమని తెలిపారు.