డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్, ప్రశాంతి నిలయం ప్రధాన వీధుల్లో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. కుటుంబ సంక్షేమం కోసం ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలని ప్రతిజ్ఞలు చేశారు.