కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి

0చూసినవారు
కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి
పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న మహేష్, రంగాలను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మహేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ధర్మవరం వైపు వెళ్లిపోయిన కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్