పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. యువకుడు తరుణ్ ఇంటి పైనుంచి సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.