కనగానపల్లిలో 100 అరటి చెట్ల నరికివేత

5చూసినవారు
కనగానపల్లిలో 100 అరటి చెట్ల నరికివేత
కనగానపల్లికి చెందిన రైతు లింగుంట్ల సత్యనారాయణకు చెందిన అరటి తోటలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సుమారు 100 అరటి చెట్లను ధ్వంసం చేశారు. రెండెకరాల్లో సాగు చేసిన ఈ పంట, 20 రోజుల్లో కోతకు రానుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వల్ల రైతుకు సుమారు రూ. 50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్