కుందుర్పి మండలం జంబు గుంపులలో పొలాలకు వెళ్లే రహదారి విషయంలో రెండు వర్గాల రైతుల మధ్య ఘర్షణ కొనసాగింది. ఈ నేపథ్యంలో, రెవెన్యూ అధికారులు మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య రహదారిని ఏర్పాటు చేశారు. అయితే, ఓ వర్గం వారు అడ్డుపడగా, పోలీసులు వారిని పక్కకు తోసేశారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి పోలీసు బలగంతో రోడ్డు ఏర్పాటు చేయించారని మరో వర్గం రైతులు ఆరోపణలు చేశారు.