
అసెంబ్లీకి హాజరు కండి.. జగన్కు ఉండవల్లి విజ్ఞప్తి
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ని, పది మంది ఎమ్మెల్యేలతో కలిసి.. వచ్చే అసెంబ్లీ సెషన్కు హాజరు కావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి దూరంగా ఉండటం మంచిది కాదని, ప్రజా సమస్యలను అక్కడే ప్రస్తావించడం వైసీపీ చేయాల్సిన పని అని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదని, అసెంబ్లీలో మాట్లాడితేనే విలువ ఉంటుందని, మీడియా సమావేశాలతో ప్రయోజనం లేదని ఉండవల్లి స్పష్టం చేశారు.




