రాయదుర్గం నియోజకవర్గంలో రూ. 7.85 కోట్లతో కొత్త గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలు నిర్మించడంతో పాటు, ఆగిపోయిన నిర్మాణాలను ఏడాది లోపు పూర్తి చేస్తామని విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం బీఎన్ హళ్లి గ్రామంలో గ్రామసచివాలయ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కురుబ హనుమంతు, కాటా వెంకటేశులు, మాజీ జడ్పీటీసీ విజయ్కుమార్, సోము, వీరేష్ పాల్గొన్నారు.