ఆదివారం సాయంత్రం బొమ్మనహళ్ మండలం కోళగానహళ్లికి చెందిన కావలి రమేష్ అలియాస్ సన్నపాములోడు ఉద్దేహాళ్ గ్రామంలో ఎరువులు తెస్తానని చెప్పి వెళ్లి ద్విచక్రవాహనంపై వెళుతుండగా కొడవళ్లతో దారుణంగా హత్యకు గురయ్యాడు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేలినట్లు సమాచారం.