రాయదుర్గం మండలంలోని గ్రామదట్ల క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో మల్లికార్జున అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వాహనం కిందపడడంతో అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి, రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.