శుక్రవారం శింగనమల మండలంలోని పెరవలి బ్రిడ్జిపై రెండు లారీలు ఢీకొన్న దుర్ఘటనలో డ్రైవర్ హరీష్ మృతి చెందాడు. అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు సరుకులతో వెళ్తున్న లారీ, పెరవలి సమీపంలో తాడిపత్రి నుంచి వస్తున్న సిమెంట్ లోడుతో ఉన్న లారీని ఎదురుగా ఢీకొట్టింది. స్థానికులు, వాహనదారులు క్యాబిన్ను తొలగించి హరీష్ను కాపాడే ప్రయత్నం చేసినా, తీవ్ర గాయాలతో అతను అప్పటికే మృతి చెందాడు.