తాడిపత్రి మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సజ్జలదిన్నె గ్రామ సమీపంలో తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,60,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.