యల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల లహరి అనే చిన్నారికి ఏఎన్ఎం నెలవారీ ఇంజెక్షన్ వేసిన తర్వాత అస్వస్థతకు గురైంది. తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.